Banks మెగా విలీనం. ఇక 12 బ్యాంకులే.

banking-merger-india

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు ప్రటించింది. దీంతో దేశంలో ఈ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగిరానుంది.



BANKS-TELUGU
ఏ ఏ బ్యాంకుల ఎందులో విలీనం కాబోతున్నాయో చూడండి..
ఇండియన్ బ్యాంక్‌ను అలహబాద్ బ్యాంక్‌‌తో విలీనం చేయనున్నారు. దీంతో 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలిసిపోనున్నాయి. పీఎన్‌‌బీ ఈ బ్యాంకుల కార్యకలాపాలు చూసుకుంటుంది. తొలిగా విలీనం అయ్యే బ్యాంకులు ఇవే.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు వీలినం అవుతాయి. దీంతో 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆవిర్భవిస్తుంది.
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులను వీలీనం చేస్తారు. దీంతో 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏర్పడుతుంది.
2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య రానున్న రోజుల్లో 12కు తగ్గిపోతుంది.



దేశంలోనే రెండవ అతిపెద్ద జాతీయ బ్యాంకుగా… పంజాబ్ నేషనల్ బ్యాంక్.

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) విలీనం బుధవారం (ఏప్రిల్ 1) అమలులోకి వచ్చింది. దేశం, వ్యాపారం, బ్రాంచ్ నెట్‌వర్క్ పరంగా తాజా విలీనం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుందని భావిస్తున్నారు.


యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖలుగా పనిచేస్తాయి. డిపాజిటర్లతో సహా వినియోగదారులందరినీ పీఎన్‌బీ వినియోగదారులుగా పరిగణిస్తారు. విలీనం చేసిన బ్యాంకు 11,000 పైగా శాఖలు, 13,000 ఎటీఎంలు, లక్ష మంది ఉద్యోగులు, 18 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిశ్రమాల ద్వారా విస్తృత భౌగోళిక పరిధిని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలోనే, పీఎన్‌బీ శాఖలన్నీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా అన్ని ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పేర్కొన్న ఇంటర్ ఆపరేబుల్ సేవలను అందించనుంది.ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సీహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక క్షణంలో భాగమైనందుకు తమకు గౌరవం ఉందన్నారు. అత్యాధునిక సేవలను అందించే ఆధునిక నూతన తరం బ్యాంక్ అవుతుందన్నారు. వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవ చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.



భారతదేశ మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 ఏప్రిల్ 12న లాహోర్ నుండి రూ. 2 లక్షల అధీకృత మూలధనం, రూ. 20,000 మూలధనంతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ బ్యాంక్ జాతీయవాద స్ఫూర్తితో ఏర్పాటైన భారతీయ మూలధనంతో భారతీయులు పూర్తిగా నిర్వహించే మొదటి బ్యాంకుగా గుర్తింపు దక్కించుకుంది. బ్యాంక్ సుదీర్ఘ చరిత్రలో 7 బ్యాంకులు పీఎన్‌బీలో విలీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది.





Banks Merger: బ్యాంకుల విలీనం జరిగింది ఇలాగే…
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమయ్యాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తర్వాత అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మారిపోయింది.
Canara Bank: కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. దీంతో కెనెరా బ్యాంక్ నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది.
Indian Bank: ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం అయ్యాయి.
అతిపెద్ద బ్యాంకుల విలీన ప్రక్రియ ముగియడంతో 2017 లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటిలో 
1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 
2.బ్యాంక్ ఆఫ్ బరోడా, 
3.పంజాబ్ నేషనల్ బ్యాంక్, 
4.కెనెరా బ్యాంక్, 
5.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 
6.ఇండియన్ బ్యాంకులు ఇతర బ్యాంకుల్ని విలీనం చేసుకున్నాయి. 
మిగతా ఆరు ఇండిపెండెంట్ బ్యాంకులుగా ఉన్నాయి. అవి 
7.ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, 
8.యూకో బ్యాంక్, 
9.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 
10.పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 
11.బ్యాంక్ ఆఫ్ ఇండియా, 
12.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Flash...   Career Guidance Workshop from 11th – 20th October at RIE, Mysure