ఏపీలో మళ్లీ కరోనా పంజా: కొత్తగా ఏపీలో 70.. ఇతర కేసులు 61

తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 792కు చేరింది.

‘ 

తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. మిగిలిన కేసులు 61 ఉన్నాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2,944కు చేరాయి. మరో 55 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 792కు చేరింది.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2092మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 57మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల మరణాలు ఏవీ నమోదు కాలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో మూడు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చారని బులిటెన్‌లో తెలిపారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 406 ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 111మందికి వైరస్ సోకినట్లు తెలియజేశారు. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో కొత్త టెన్షన్ వెంటాడుతోంది.

Flash...   CARONA TERROR IN AP : RAISE OF POSITIVE CASES