ఏపీలో కరోనా పంజా: 24 గంటల్లో 210.. కాంటాక్ట్ కేసుల టెన్షన్

ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. శనివారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా
12,771 శాంపిల్స్‌ను పరీక్షించగా 161 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు
మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి (49 కేసులు) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 210
కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం
తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3588కు చేరాయి. మరో 21మంది వైరస్
నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల
సంఖ్య 1192కు చేరింది.

 రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 650కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2323మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 73మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి.
Flash...   ఈ రోజు 102 కరోనా positive కేసులు.