ఏపీ కరోనా బులిటెన్: కొత్తగా 138 కేసులు, భయపెడుతున్న కొత్త లింకులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 50 మందికి
కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రోజు
రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా
9,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా
బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 84మందికి..
విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య
108 నమోదయ్యాయి. 

కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా
కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3427కు చేరాయి. మరో 21మంది వైరస్ నుంచి కోలుకొని
సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1060కు
చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 650కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత
గుంటూరు జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు
2294మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 73మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల
ముగ్గురు చనిపోయారు.. కృష్ణా జిల్లాలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Flash...   మున్ముందు మరింత ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్