AP లో కరోనా పంజా: కొత్తగా 222 కేసులు, పెరిగిన కాంటాక్ట్ కేసులు

రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం
ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్
పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య
ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి
కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా
కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి
సంబంధించిన కేసులు 4588కు (మొత్తం 5636కు) చేరాయి. మరో 42మంది వైరస్ నుంచి
కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య
1865కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 800కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు
జిల్లాలో 500కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2641మందికి
నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా
కరోనాతో మొత్తం 82మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో
ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు,
విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.
Flash...   ఏపీలో మళ్లీ కరోనా పంజా: కొత్తగా ఏపీలో 70.. ఇతర కేసులు 61