AP BUDGET 2020 HIGHLIGHTS

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక
ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా
వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు
  • రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు
  • ఈ సారి బడ్జెట్‌లో ఈ రంగాలకు భారీగా అదనపు కేటాయింపులు
  • బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయింపులు
  • మైనార్టీ సంక్షేమానికి గతేడాది కంటే 115 శాతం అదనంగా కేటాయింపులు
  • సాంఘిక సంక్షేమానికి గతేడాది కంటే 110 శాతం అదనంగా కేటాయింపులు
  • మహిళా, శిశు సంక్షేమానికి గతేడాది కంటే 28 శాతం అదనంగా కేటాయింపులు
  • వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు
  • వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
  • పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
  • గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
  • హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
  • జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
  • పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
  • ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
  • కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
  • పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
  • న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
  • మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
  • ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
  • విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు
  • ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
  • సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
  • ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
  • మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు
  • ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
  • పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు
  • సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు
  • ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు
  • గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు
  • 104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు
  • సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
  • రవాణా రంగానికి రూ.6,588 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు
  • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు
  • సవరించిన అంచనాలు 2019-20
Flash...   సందేహాలు సమాధానాలు 2
సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​
వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు
  • వైఎస్సార్‌ లా నేస్తం కోసం రూ. 12. 75 కోట్లు
  • రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు
  • జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు 
  • కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు
  • ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు
  • నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు
  • పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు 
  • రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు
  • గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు 
  • అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు
  • వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు
  • డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు
  • కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు 
  • వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు
  • వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు
  • డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు
  • జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు
  • వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
  • వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు
  • వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు
  • వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు
  • జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు
  • జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు
  • గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
  • రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు
  • వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
  • జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
  • డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
  • వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు 
  • 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగింది
బడ్జెట్‌ ప్రసంగంలో బుగ్గన ..
దేశప్రజలు గొప్పవాళ్లయితేనే దేశం గొప్పదవుతుంది. అలాగే పాలకులు, కార్యాశీలురు
మరియు ప్రజా సేవాపారయణులు అయితేనే మంచి పనులు జరుగుతాయి. ప్రజలు మెచ్చే మంచి
పనులు చేసేందుకు పాలకుడి ఉత్సాహం, పట్టుదల, నిబద్దత, ప్రయత్నం ఉంటే చాలు..
తండ్రి వెంట బిడ్డల్లా జనం పాలకుడితో కదిలి వస్తారు. అడగకుండానే స్నేహహస్తం
అందిస్తారు అని స్వామి వివేకానంద సూక్తులను ఆర్థిక మంత్రి
గుర్తుచేశారు. 
Flash...   Padma Vibhushan Chiranjeevi: పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు చిరంజీవి కి అవన్నీ ఫ్రీగా ఇస్తారా?
కష్టాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయనప్పుడు వారి ముఖాల్లో
చిరునవ్వు వెలిగించనప్పుడు వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు
అభివృద్దికి అర్థమే లేదు
మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను ఇచ్చాక ఆలోచించేది ఏముంది ముందుకు వెళ్లాల్సిందే
అన్ని దివంగత మహానేత వైఎస్సార్‌ చెప్పిన సూత్రాన్ని మన ప్రభుత్వం
పాటించుకుంటూ వెళుతుంది. 
ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పుని సాధించడానికి అంకితమైతే ప్రతికూల
పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు. 
మానవభివృద్ది సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలపడం కన్నా
మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నాం
కరోనా విపత్తు పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశాం
కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమంపై వెనకడుగు వేయలేదు
రైతులకు సాయం చేయడం ద్వారా ప్రాథమిక రంగానికి ఊతం
గత ప్రభుత్వం చెప్పిన రెండంకెల వృద్ది బూటకం
పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం.
పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం.
‘అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ
బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పెట్టిన చీఫ్ ‌విప్‌
శ్రీకాంత్‌రెడ్డి.