Ration cards in the Secretariat from now

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని నిరుపేదలకు
కార్డులు అందించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం రూపొందించింది. దీనికి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోద ముద్రవేశారు. ఇక నుంచి రేషన్‌కార్డులు గ్రామ,
వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని,  దరఖాస్తు చేసుకున్న ఐదు
రోజుల్లోనే రేషన్‌ కార్డు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. ఇది ఈనెల 6వ తేదీ
నుంచి అమల్లోకి రానుంది.
అంతేకాదు త్వరలోనే రేషన్‌ను డోర్‌ డెలివరీలో భాగంగా కార్డుదారులకు ప్రభుత్వం
ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి 10,15 కిలోల
చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనుంది. ఒక్కో సంచి తయారీకి రూ. 25
చొప్పున ఖర్చు అవుతుంనది అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌
తెలిపారు.
Flash...   Public Holidays 2024: వచ్చే ఏడాదిలో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఆ నెలలోనే ఎక్కువ..