నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్‌

నాడు–నేడు ప్రభుత్వానికి టాప్‌ ప్రయార్టీ

మొదటి విడత నాడు–నేడులో 15 వేల స్కూళ్లలో అభివృద్ధి

దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు

మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లు
పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష
తాడేపల్లి : ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పనులు పూర్తి కావాలని
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు,
వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి
వైఎస్‌ జగన్‌ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న
వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని
అధికారులను ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను
పెట్టుకుని ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత
సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని వైఎస్‌ జగన్‌
అన్నారు. 
విద్యారంగంలో నాడు-నేడు
విద్యారంగంలో నాడు-నేడు పనులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై
సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు
చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి
రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే
చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి మొదటి విడత
నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు.
అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత
నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని
అధికారులు సీఎంకు తెలిపారు.
Flash...   Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? ఫ్రీగా తెలుసుకోండి ఇలా..
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు
కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం
కొనసాగాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో
మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు
పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు. ఆస్పత్రులు,
మెడికల్‌ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత
ముఖ్యమైనదన్నారు. అక్టోబర్‌ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని
సీఎం అధికారులను ఆదేశించారు.
వైద్యం – ఆరోగ్య రంగం:
►16 కొత్త మెడికల్‌ కాలేజీలు, 1 సూపర్‌ స్పెషాల్టీ, 1 క్యాన్సర్‌ ఆస్పత్రి, 1
మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ. 6657 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
► అలాగే ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుంబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్‌
స్పెషాల్టీ ఆస్పత్రుల కోసం మరో రూ.6099 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
►ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236
కోట్లు ఖర్చు 
►అలాగే పీహెచ్‌సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671
కోట్లు ఖర్చు కాగలదని అంచనా
►విలేజ్‌ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ మరియు కొత్త వాటి నిర్మాణం
కోసం రూ.1745 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. 
►వీటికి నిధుల అనుసంధానంపైనా సీఎం అధికారులతో చర్చించారు. 
► ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు
అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకుసాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
అధికారులను ఆదేశించారు. 
సాగునీటి ప్రాజెక్టులు:
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98
వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్ల కొత్త
ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయన్నారు. రాయలసీమ ప్రాంతంలో  కరువు నివారణ కోసం
ఉద్దేశించిన పనుల కోసం ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో
సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్‌ క్లోజర్‌
పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 1 నుంచి
రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు
చేయాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ పనులతో పాటు, స్టేట్‌ వాటర్‌
సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ (పోలవరం చేపట్టాల్సిన  నుంచి వరద జలాల తరలింపు),
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ–తాగునీటి వసతి కల్పన,
కృష్ణా–కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా పనులను ప్రాధాన్యతా క్రమంలో
చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 
Flash...   ఈ రోజు భారత్‌లో కొత్తగా 11,929 కరోనా కేసులు
ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక,
విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, జలవనరులశాఖలకు చెందిన
ఉన్నతాధికారులు హాజరయ్యారు.