ఆధార్ కార్డ్ కలిగిన వారికి UIDAI స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయొద్దంటూ హెచ్చరిక

ఆధార్ కార్డ్ కలిగిన వారికి UIDAI స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయొద్దంటూ హెచ్చరిక.. లేదంటే..

ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కీలకమైన
డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఆధార్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి
రావొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు
పొందలేరు. ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) కూడా దాఖలు చేయలేరు.
అయితే ఆధార్ కార్డు ఉపయోగించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. యూఐడీఏఐ తాజాగా ఆధార్
కార్డు కలిగిన వారిని హెచ్చరించింది. లామినేషన్ ఆధార్ కార్డు, ప్లాస్టిక్ ఆధార్
కార్డు కలిగిన వారిని అలర్ట్ చేసింది. ఇలాంటి కార్డులకు క్యూఆర్ కోడ్
పనిచేయకపోవచ్చని హెచ్చరించింది. అంతేకాకుండా మీ వ్యక్తిగత సమాచారం తస్కరణకు
గురికావొచ్చని పేర్కొంది.
మీ అనుమతి లేకుండానే మీ డేటా ఇతరుల చేతికి వెళ్లొచ్చని హెచ్చరించింది. ప్లాస్టిక్
ఆధార్ కార్డు లేదా లామినేషన్ ఆధార్ కార్డును ఉపయోగించవద్దని కోరింది. వీటి వల్ల
మీ ఆధార్ వివరాలకు ప్రమాదం పొంచి ఉందని తెలియజేసింది. అంతేకాకుండా ఇలాంటి ఆధార్
కార్డులు కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చని పేర్కొంది.
అంతేకాకుండా ఆధార్ కార్డును ప్లాస్టిక్ లేదా పీవీసీ షీట్‌ మీద ప్రింట్ చేయడానికి
రూ.50 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారని పేర్కొంది. కొన్ని చోట్ల అయితే ఇంకా
ఎక్కువగానే వసూలు చేస్తున్నారని తెలిపింది. అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు
ఇలా చేయవద్దని, వారి ట్రాప్‌లో పడొద్దని పేర్కొంది.
ఆధార్ కార్డును యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్
జిరాక్స్ అయినా సరిపోతుందని, కలర్ జిరాక్స్ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది.
అందువల్ల ప్లాస్టిక్ కార్డు, లామినేషన్ చేయించడం వంటి పనులు చేయవద్దని కోరింది.
డబ్బులతోపాటు విలువైన సమచారాన్ని కూడా కోల్పోవద్దని తెలిపింది.
Flash...   RBI MORATORIUM ON LOAN EMI- FACTS