Memory Loss: గంటల తరబడి కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందా?

 మెమరీ లాస్: గంటల తరబడి కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందా? మీరు ప్రతిరోజూ ఎంతసేపు నిలబడాలి?

గంటల తరబడి నిశ్చలంగా కూర్చోవడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా భుజం, వెన్ను నొప్పి వస్తుంది. (బ్యాక్ అండ్ నెక్ పెయిన్) న్యూయార్క్‌కు చెందిన “గ్లోబల్ వెల్ బీయింగ్ లీడ్” ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల మెదడుపై కొంత ప్రతికూల ప్రభావం ఉంటుందని వెల్లడైంది.

వెన్నుపాముపై ప్రభావం వల్ల మనిషి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే నిరంతరం ఎంతసేపు కూర్చోవాలో తెలుసా?

ఒక వ్యక్తి రోజుకు కనీసం మూడు గంటల పాటు నిలబడాలని “గ్లోబల్ వెల్బీయింగ్ లీడ్” చెబుతోంది. ఉదాహరణకు, మీరు ఆఫీసులో రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుందనుకుందాం. ప్రతి అరగంటకు 2 నిమిషాలు లేచి నిలబడండి. ఆఫీసులో ఎవరూ మీకు నో చెప్పరు.. నిలబడితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. వీపు మరియు భుజాలపై భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు కనీసం అరగంట పాటు నిలబడితే, ఇది నరాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే నిలబడటం వల్ల టెంపోరల్ లోబ్ దెబ్బతింటుందనే భయం తగ్గుతుంది. మెదడులోని టెంపోరల్ లోబ్ అనే భాగం జ్ఞాపకశక్తిని నిల్వ చేస్తుంది. నిలబడటం వల్ల.. తల నుంచి కాలి వరకు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగితే.. శరీర అలసట కూడా తగ్గుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేసేవారి మరణాలు దాదాపు 60 శాతం. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారు ఊబకాయంతో చనిపోయే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. పనిలో కూర్చొని తక్కువ సమయం గడిపే వ్యక్తుల మరణాల రేటు తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఎక్కువ సేపు కూర్చునే ఉద్యోగులు లేచి నిలబడి మధ్యమధ్యలో ఐదు నుంచి పది నిమిషాల విరామం తీసుకోవాలి. అంతేకాదు.. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Flash...   చర్చలకు ముందు.. ఇరువైపులా సానుకూల సంకేతాలు- Live