Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం

New Delhi: Earthquake occurred in the capital city of New Delhi

An earthquake measuring 5.2 on the Richter scale struck Bajura, Nepal today at 1:45 pm, Nepal’s National Earthquake Monitoring & Research Center said. According to media reports, the earthquake hit parts of Delhi NCR and UP

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం భూకంపం సంభవించింది. నేపాల్ మధ్యలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం నేపాల్‌లో ఈ భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఈ ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్‌లోని బజురాలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ అబ్జర్వేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది.

బుధవారం మధ్యాహ్నం 1:30:23 గంటలకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో భూకంపం ప్రభావం కనిపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. భూకంప కేంద్రం హరిద్వార్‌లో ఉన్నట్లు సమాచారం.

ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు

Flash...   ఒంటిపూట బడులు నిర్వహిం చాలి : STU