AP పౌర సరఫరాల సంస్థలో 4,033 ఒప్పంద ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే పోస్టింగ్‌.

AP పౌర సరఫరాల సంస్థలో 4,033 ఒప్పంద ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే పోస్టింగ్‌.

సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లాల వారీగా 4,033 ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఈ పోస్టులను ఖరీఫ్ 2023-24 సీజన్ వరి సేకరణ సేవల కోసం రెండు నెలల పాటు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) భర్తీ చేస్తుంది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. తాజాగా విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మిగిలిన జిల్లాలకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు

టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తారు. ఏదేమైనప్పటికీ, ఎటువంటి వ్రాత పరీక్ష నిర్వహించబడదని నోటిఫికేషన్‌లలో స్పష్టంగా పేర్కొనబడింది మరియు ఈ పోస్టుల నియామక ప్రక్రియ విద్యార్హతలు, పని అనుభవం మరియు అదనపు అర్హతల (TA/ DEO పోస్టులకు) ఆధారంగా మాత్రమే ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి 10వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టీఏ, డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. హెల్పర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా జిల్లా కేంద్రాల్లోని APSCSCL కార్యాలయాల్లో సమర్పించాలని పౌరసరఫరాల సంస్థ తన ప్రకటనలో తెలిపింది.

Flash...   నెలకు రూ. 1.51 వేల జీతం తో ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. అర్హతలు ఇవే..