హైదరాబాద్‌కు వచ్చేసిన ‘వరల్డ్‌కప్ ట్రోఫీ’.. జరగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవే.

హైదరాబాద్‌కు వచ్చేసిన ‘వరల్డ్‌కప్ ట్రోఫీ’.. జరగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవే.

మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. క్రికెట్ కు మరే ఆటలోనూ లేని సందడి.. భారతీయులు ఈ క్రీడనే పరమావధిగా భావిస్తారు. అలాంటి అభిమానులున్న భారత్ లోనే ఈసారి వన్డే ప్రపంచకప్ జరగనుంది.

ప్రపంచంలోని టాప్ 10 జట్ల మధ్య భారత్‌లో మరో వారం రోజుల్లో ఈ క్రికెట్ వార్ ప్రారంభం కానుంది.

ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటుంది. ట్రోఫీని ఒక్కసారైనా చూడాలని కోరుకునే వారు లక్షలాది మంది ఉన్నారు. అలాంటి వారి కోసం క్రికెట్ ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ ను ప్రారంభించింది.

జూన్ 27న భారత్‌లో ట్రోఫీని అందించగా.. జూన్ 27 నుంచి ప్రారంభమైన ఈ టూర్‌లో దాదాపు నాలుగు నెలల పాటు ప్రపంచకప్ ట్రోఫీ వివిధ దేశాలను చుట్టేసింది. భారత్ నుంచి ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఇంగ్లండ్.. ఆ తర్వాత పాకిస్థాన్.. మొన్న బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శించాయి..

పాకిస్థాన్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శించారు.. చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. . ఐసీసీ ఈ ప్రపంచకప్ ట్రోఫీని 18 దేశాల్లో అందించింది. సెప్టెంబర్ 4 నుంచి భారత్‌లో ట్రోఫీని ఉంచారు.ఇప్పటికే చెన్నైలో ఐసీసీ ట్రోఫీని ప్రదర్శించగా.. తాజాగా ప్రపంచకప్ ట్రోఫీ హైదరాబాద్‌కు చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రజల సందర్శనార్థం ఉంచింది.

మేము 6 వారాల పాటు ప్రపంచంలోని 10 అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నందున దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరుగుతోంది. క్రికెట్ దేశంలోని ప్రతి ఒక్కరినీ ఏకం చేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం ఉప్పల్‌ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో రెండు వార్మప్ మ్యాచ్‌లు కాగా మూడు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఐదు మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌దే.

Flash...   భారత్‌ గెలిస్తే 100 కోట్లు పంచుతా! కంపెనీ CEO బంపర్‌ ఆఫర్‌ !

సెప్టెంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 3 వన్డేల సిరీస్.. ఐసీసీ ర్యాంకింగ్ ఖరారు చేయనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఏ జట్టు నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిగమిస్తుందో ఈ సిరీస్ నిర్ణయిస్తుంది.