ఏపీ ప్రజలకు CM JAGAN గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచే పంపిణి ..

ఏపీ ప్రజలకు CM JAGAN గుడ్‌ న్యూస్.. డిసెంబర్‌ 18 నుంచే పంపిణి ..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. పేదల వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య రక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందజేసి మందుల కొరత లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్యం, ఆరోగ్య సేవలు అందించడంలో రాజీ పడవద్దని సీఎం సూచించారు.

పెద్ద మొత్తంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నందున ప్రింటింగ్ కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారంతో కూడిన బ్రోచర్లు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. కాగా, జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని.. ప్రతి మండలంలో ఆరోగ్య భద్రత శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

2023-24లో నవంబర్ చివరి నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందారని, ఇది గతేడాది కంటే 24.64 శాతం అధికమని అధికారులు తెలిపారు. అలాగే.. ప్రస్తుతం చైనాలో హెచ్9ఎన్2 వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.

Flash...   Abyasa App Login Problems