AP Arogyasree: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ హెల్త్ కార్డ్.. పూర్తి వివరాలు

AP Arogyasree: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ హెల్త్ కార్డ్.. పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించనున్నారు. కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను సీఎం జగన్ ప్రారంభించారు.

ఇక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఇక నుంచి రాష్ట్రంలోని పేదలెవరూ వైద్యం కోసం అప్పులు చేయకూడదని, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆసుపత్రుల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోగ్యశ్రీని రూ.25 లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఎవరికి ఎలాంటి వైద్యం కావాలన్నా… ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే… రూ. 25 లక్షల ఉచిత చికిత్స అందుతుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్న వారికి మళ్లీ వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు రూ. 300 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పేదలపై వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ రూ. 55 నెలల కాలంలో వైద్య రంగంలో సంస్కరణల కోసం 32,279 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

Flash...   Provisions relating to pre-mature retirement in the Fundamental Rules and CCS (Pension) Rules, 1972

విద్య, ఆరోగ్యం ప్రజల హక్కు. ఈ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వీటిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

ఆసుపత్రి భవనాలను ఆధునీకరించడమే కాకుండా వైద్యులు, సిబ్బంది సమయపాలనలో ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారు. ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇలా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇప్పుడు ఆరోగ్యశ్రీ రూ. 25 లక్షలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.