పదో తరగతి తో హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలు..వివరాలు ఇవే..

పదో తరగతి తో  హైదరాబాద్‌లోని  కేంద్ర ప్రభుత్వ సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాలు..వివరాలు ఇవే..

హైదరాబాద్‌లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాల్లో 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత విభాగంలో ITI  ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయస్సు :

అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2023 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.21,700 నుండి రూ.69,100 వరకు చెల్లించబడుతుంది.

ఉద్యోగ ప్రదేశం :

ఎంపికైన అభ్యర్థులు.. NRSC- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పూర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూఢిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పూర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు) వీటిలో ఏదైనా ఒక ప్రదేశంలో పనిచేయాలి.

Details of posts..

  • Technician-B (Electronic Mechanic) Posts: 33
  • Technician-B (Electrical) Posts: 8
  • Technician-B (Instrument Mechanic) Posts: 9
  • Technician-B (Photography) Posts: 2
  • Technician-B (Desktop Publishing Operator) Posts: 2

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 09, 2023 నుండి ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ : డిసెంబర్ 31, 2023.

దరఖాస్తును పూరించే సమయంలో, రిజిస్ట్రేషన్ ఫీజు కింద దరఖాస్తు రుసుము కింద రూ.600 చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Flash...   కొత్త జంటలకు Samsung వస్తువులపై స్పెషల్ ఆఫర్! వివరాలు ఇవే.. !