School Education: నలుగురు MEO లు, ఇద్దరు HM లపై చర్యలు..

School Education: నలుగురు MEO లు, ఇద్దరు HM లపై చర్యలు..

• పర్యవేక్షణలో నిర్లక్ష్యంపై RJD ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యకు సిఫార్సు

గుంటూరు (విద్య), నవంబర్ : పాఠశాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థులకు వర్క్‌బుక్స్ పంపిణీలో జాప్యం చేసిన నలుగురు ఎంఈఓలు, ఇద్దరు హెచ్‌ఎంలపై చర్యలకు సిఫార్సు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈమేరకు ఆయన జిల్లా విద్యాశాఖ, ఆర్జేడీలకు ఈ ఉత్తర్వులు పంపారు. ఈ నెల 4న ప్రవీణ్ ప్రకాష్ చేబ్రోలు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్నా ఎస్‌ఏ-1 సిలబస్‌ పూర్తి కాకపోవడం, విద్యార్థుల వర్క్‌బుక్స్‌ సరిచేయకపోవడం, వాటిని పర్యవేక్షించాల్సిన MEO-1 ప్రసాద్‌, MEO- 2 రావెల ప్రసాద్‌లు ప్రవీణ్‌ప్రకాష్‌లు గుర్తించారు. , నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, ఎంఈఓలతో పాటు హెచ్‌ఎంపై చర్యలకు సిఫార్సు చేశారు.

అదేవిధంగా గుంటూరు మండలం వెంగళాయ పాలెం జెడ్పీ పాఠశాలలో వర్క్‌బుక్‌లు సరిచేయలేదని, ఎంఈఓలు ఒక్కసారి కూడా పాఠశాలలను తనిఖీ చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. విద్యార్థులకు వర్క్‌బుక్‌లు పంపిణీ చేయాల్సి ఉన్నా 5 నెలల నుంచి పట్టించుకోలేదని, తనిఖీలో కూడా ఎంఈవో-1, 2 వెంకటేశ్వరరావు, జ్యోతికుమారి అందుబాటులో లేరని నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎంఈఓలతో పాటు ఆయా పాఠశాలల హెచ్‌ఎం సీజే మణికుమార్‌పై చర్యలకు సిఫారసు చేశారు

Flash...   SCERT - Training for Professional Development from 12th - 16th Oct., 2020 at Bhopal