‘నేను ఆర్డర్ ఇస్తే.. అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే ఉండదు. ‘..మిమ్మల్ని డెమోట్ చేస్తా.. DEO పై ప్రవీణ్ ప్రకాశ్‌ ఫైర్

‘నేను ఆర్డర్ ఇస్తే.. అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే ఉండదు. ‘..మిమ్మల్ని  డెమోట్ చేస్తా.. DEO పై ప్రవీణ్ ప్రకాశ్‌ ఫైర్

లింగసముద్రం, న్యూస్టుడే: ‘ఆర్డర్ ఇస్తే.. అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే ఉండదు. ‘మీరేమనుకున్నా.. మీ ఇష్టం’ అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని, కందుకూరు ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాసులపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లింగసముద్రం మండలంలోని మొగిలిచెర్ల ఉన్నత పాఠశాలను ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థుల్లో ఆరుగురికి మాత్రమే ఇంగ్లిష్ పుస్తకాలు ఉన్నాయి. మిగిలిన విద్యార్థుల అసైన్‌మెంట్‌లు సరిగా లేవు. మిడ్ ఇయర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు.. విద్యా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకుంటారు.. ఒక్కో అధికారి రూ.లక్షలు వేతనాలు పొందుతూ పాఠశాలలను పర్యవేక్షించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. చర్యలు తీసుకోవాలని ఉప విద్యాశాఖాధికారిని ఆదేశించారు. లేకపోతే

నిన్ను డిమోట్ చేస్తానని డీఈవో గంగాభవానీని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, గోరుముద్ద పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఏ పాఠశాలలోనైనా 85% మంది విద్యార్థులు మంచి విద్యార్థులే. మిగిలిన 15 శాతం మంది పిల్లలు వెనుకబడి ఉన్నారని చూస్తున్నాం. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా చదువులు సాగుతున్నాయి’ అంటూ అధి కారులపై అసహనం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన సీఆర్పీలను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏపీసీ ఉషారాణిని ఆదేశించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ప్రవీణ్ ప్రకాశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గంగపాలెం ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. మూడో తరగతి విద్యార్థుల పుస్తకాలు నాసిరకంగా ఉన్నాయని ఎంఈవో-2 శివకుమార్ ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: https://www.eenadu.net

Flash...   AP లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల