బ్రౌన్ రైస్ , వైట్ రైస్.. ఏ బియ్యం తింటే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..?

బ్రౌన్ రైస్ , వైట్ రైస్.. ఏ బియ్యం తింటే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..?

సాధారణంగా అందరూ వైట్ రైస్ తింటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో బ్రౌన్ రైస్, రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
అయితే, ఏ బియ్యం మనకు ఆరోగ్యకరమో పరిశీలిస్తే..

తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తెల్ల అన్నం తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. పైగా పాలిష్ చేయడం వల్ల ఈ బియ్యంలో పోషకాలు తగ్గుతాయి. దీని వల్ల ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాబట్టి ఎక్కువగా పాలిష్ చేసి వైట్ రైస్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధాన్యం నుండి పొట్టు వేరు చేయబడిన తర్వాత వచ్చే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో కనిపిస్తుంది.

ఈ అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రెడ్ రైస్.. ఈ రైస్ ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఆంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ రంగుకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్లు లభిస్తాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.

అందుకే డాక్టర్లు కూడా వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఆరోగ్యకరమని అంటున్నారు. వీటిని రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు ఎలాంటి మందులు వాడకుండానే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ అన్నం శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిలో పీచు ఎక్కువగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ బ్రౌన్ అండ్ రెడ్ రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని షుగర్ సమస్య ఉన్నవారు అంటున్నారు.

ఈ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ రైస్ తింటే ఆరోగ్యంగా జీవించాలనుకునే వారు కచ్చితంగా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Flash...   ఈ సమస్యలుంటే అరటిపండు అస్సలు తినొద్దు?